21, మార్చి 2018, బుధవారం

కానుకలను చదివించు చున్నారు


ఇదె  చూడుడీ రాజు లెందరో కానుకలను
చదివించు చున్నారు సార్వభౌమునకు

రతనాలు ముత్యములు రాసులుగా కొందరును
అతిమనోహరములగు పతకములు కొందరును
కుతుకముతో బంగారము కొండలుగా కొందరును
ప్రతిలేని రఘునాథుని పట్టాభిషేక వేళ

కానుకలుగ రాజ్యములే కరుణించు ప్రభువుకు
కానుకలను తెచ్చిరిదే ఘనులైన రాజులని
దావవేశ్వరుని తోడ వానరేశ్వరు డనగ
దానికేమి యిది సంప్రదాయమను నాతండును

రాకాసుల నడగజేసి లోకేశు లందరకును
ప్రాకటముగ చిత్తశాంతి పరగ కానుక జేసె
ఆ కడిది వీరున కిదె యందింతురు వేడుకతో
చేకొనుమని శక్తికొలది సాకేతరామునకు